నిజామాబాద్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం      

- లారీ ఆటో ఢీ.. ముగ్గురు దుర్మరణం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిజామాబాద్‌ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు రెంజల్ మండలం జూపల్లి వాసులుగా గుర్తించారు. నిజామాబాద్‌లోని అర్సపల్లి బైపాస్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఇటీవల జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు యువకులు నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. కొండగట్టుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సుభాష్‌నగర్‌కు చెందిన ఉమ్మడి అశోక్మంద మోహన్‌రమేష్‌‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.