ఒకే రోజు తండ్రి కొడుకులు మరణం

.. గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాటలకందని విషాదం ఇది.. ఒకే రోజు తండ్రీకొడుకుల మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన మాదేష్‌, బేబి దంపతులు రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వీరికి జగదీష్‌ ఒక్కగానొక్క కుమారుడు.. అతడికి వివాహంకాగా.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీష్ హైదరాబాద్‌లో సెంట్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 25న ఎమ్మిగనూరు వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కుమారుడికి ప్రమాదం జరగడంతో తండ్రి మాదేష్‌ తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలు పోయాయి. కుమారుడికి ఆపరేషన్‌ చేస్తుండడంతో హైదరాబాద్‌ వెళ్లిన మాదేష్‌ భార్య బేబి వెంటనే ఎమ్మిగనూరు వెళ్లారు. ఆయన అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే.. హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేస్తుండగా జగదీష్ బీపీ, షుగర్‌ లెవల్స్ పెరిగి కన్నుమూశాడు. ఒకే రోజు తండ్రీకొడుకుల మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. భర్త మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌తో భార్య రాధ ఒక్కటే ఎమ్మిగనూరు వచ్చింది. తండ్రి మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కుమారుడు కూడా చనిపోవం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం పెద్ద దిక్కులుగా ఉన్న ఇద్దరిని కోల్పోయింది.

Leave A Reply

Your email address will not be published.