ప్రతిభ కలిగిన అథ్లెటెక్స్ విద్యార్థులకు ఆర్దిక సహాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చౌటుప్పల్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల నందు చదువుతున్న విద్యార్థులు యాదాద్రి భువనగిరి లో జరిగినటువంటి జిల్లా స్థాయి అథ్లెటెక్స్ గెలుపొందారు. వారు తదుపరి రాష్ట్రస్థాయి అట్టర్ టెక్స్ట్ లో పాల్గొనుటకై కరీంనగర్ కు  వెళ్ళుటకు గాను రవాణా ఖర్చులకోసం పాలకూర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పాలకూర మురళి ఒక్కొక్కరికి 700 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఆయన  మంగళవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ప్రేరణ కలిగించే పుస్తకాలను అందజేసారూ.. ఈ సందర్భంగా పాలకూర్ల మురళి మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి మా ఫౌండేషన్ ద్వారా మేము ముందు ఉంటామని చెప్పారు.. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కే భవాని మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.