మాల్యాద్రి సేవట్రస్ట్ ద్వారా ఆర్దిక సహాయం అందజేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నసురుల్లాబాద్: మాల్యాద్రి రెడ్డి సేవా ట్రస్టు ద్వారా మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన బామని శ్రీనివాస్ కు బిజెపి నాయకులు శనివారం 5000 ల రూపాయల అర్దికసహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ కాలికి గాయం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చందురీ హన్మండ్లు, BJYM మండల అధ్యక్షులు సాయి కుమార్, బీజేపీ మండల కార్యదర్శి రాము, జెల్ల సాయిలు, రాములు, శ్రీను, సాయిలు, రాకేష్, భాను, వినోద్ , బాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.