మదన్ మోహన్ రావు సహకారంతో క్రీడాకారినులకు ఆర్థిక సహాయం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలోని క్రీడాకారినులకు టీపీసీసీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు సహకారంతో ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు. పాఠశాలకు చెందిన అఖిల, మౌనిక లు వరంగల్ లో జరిగే అండర్ 14, అండర్ 19 విభాగలలో అథ్లెటిక్స్ కు ఎంపిక ఐయ్యారు. ఇద్దరూ కూడా పేద కుటుంబం నుండి వచ్చిన విద్యార్థులు కావడంతో వరంగల్ వెళ్లడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్నీ పాఠశాల ప్రిన్సిపాల్ శిల్ప, పిఈటీ సవిత స్థానిక కాంగ్రెస్ ఎంపీటీసీ తూర్పు రాజులు తెలిపారు. విద్యార్ధినుల విషయం టీపీసీసీ చైర్మన్ మదన్ మోహన్ రావు కు తెలుపగా స్పందించిన ఆయన వారికి ఆర్థిక సహాయం పంపించారు. వారి సహకారంతో ఇద్దరు విద్యార్థినిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీటీసీ తూర్పు రాజు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, గణేష్, సంతోష్, రవి, సాయిలు, శ్రీకాంత్, రమేష్, రాజు, మంజ రమేష్, దేవీసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.