మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై..ఎఫ్ఐఆర్ నమోదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై .. యూపీలోని రాంపూర్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు వారిపై కేసు బుక్ చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలకు ప్రియాంక్ ఖర్గే మద్దతు ఇచ్చారు. ఐపీసీలోని సెక్షన్ 295-ఏ(మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), 153-ఏ(రెండు గ్రూపులను రెచ్చగొట్టడం) కింద ఇద్దరిపై కేసు నమోదు చేశారు.రాంపూర్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశారు. లాయర్లు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును నమోదు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ వేత్తలు ప్రకటనలు చేసినట్లు స్టాలిన్పై ఫిర్యాదు చేశారు. సనాతనం ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో స్టాలిన్ పోల్చారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఆ అంశంపై స్పందించాయి. ఆ వ్యాఖ్యలను ఖండించాలని కాంగ్రెస్పై బీజేపీ వత్తిడి తెస్తోంది.