పాతాల్కోట్ ఎక్స్ ప్రెస్లో అగ్నిప్రమాదం.. రెండు కోచ్లు పూర్తిగా దగ్దం
- పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాతాల్కోట్ ఎక్స్ ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ నుంచి మధ్యప్రదేశ్లోని సోనీకి వెళ్లే పాతాల్కోట్ ఎక్స్ప్రెస్లో బుధవారం మంటలు చెలరేగాయి. ఆగ్రా-ధోల్పూర్ మధ్య భదాయి రైల్వే స్టేషన్ సమీపంలో జనరల్ కోచ్లో మంటలు రాజకున్నాయి. ఈ మంటలు ఇతర కోచ్లకు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళన చెందారు.కాగా, మంటలు, పొగలు గమనించిన లోకోపైలట్లు ఆ రైలును నిలిపివేశారు. కాలుతున్న కోచ్లను వేరు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు రైలు కోచ్లు మంటల్లో కాలుతున్న వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.