బీర్కూర్ లో మునుగోడు గెలుపు సంబురాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో మండల కేంద్రం బీర్కూర్ తో పాటు గ్రామాలలో తెరాస నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగాసీనియర్ నాయకులు, మాజి జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ బీజేపీ ఎన్ని నాటకాలు వేసిన ప్రజలు తెరాస ను గెలిపించారని తెలిపారు. బీజేపీ అహంకారానికి, కెసిఆర్ అభివృద్ధి కి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు కెసిఆర్ అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు. ఈ గెలుపు సంబురాలలో ఎంపీపీ రఘు, మండల పార్టీ అధ్యక్షుడు వీరేశం, గ్రామ పార్టీ అధ్యక్షుడు దుంపల రాజు, ఎంపీటీసీ సందీప్, కో ఆప్షన్ ఆరీఫ్,రైతు సమన్వయ అధ్యక్షుడు అవారి గంగారాం,లాడేగాం గంగాధర్, పడితే నారాయణ, సాయికుమార్, వడ్ల బస్వరాజ్ నాయకులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.