బి ఆర్ ఎస్ ఎల్ పి నేతగా మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. . కాగా.. హోం మంత్రిత్వ శాఖ, మున్సిపాలిటీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆయన వద్దే ఉంచుకున్నారు. మంత్రివర్గ విస్తరణ చేసే సమయంలో వాటిని ఇతరలకు కేటాయించే అవకాశం ఉంది.  భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ సమావేశాలకు దూరం ? అయితే బీఆర్ఎస్ కూడా తమ ఎల్పీ నేతను శనివారం ఉదయం ఎన్నుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా శాసన సభా సమావేశాల కంటే ముందే పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు.  బీఆర్ఎస్ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ గారి పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రతిపాదనను మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. అలాగే శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ కు అప్పగించారు. ఈ మేరకు సభ్యులంతా ఏకగీవ్రంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.