మాజీ మంత్రి అవంతి కి చెప్పుల దండ తో గ్రామస్తులు స్వాగతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ కు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలి మండలం, కె.నగరపాలెం వెళ్లారు. అక్కద స్థానికులు అవంతి శ్రీనివాస్‌కు ఝులక్ ఇచ్చారు. చెప్పుల దండ తో గ్రామస్తులు స్వాగతం పలికారు. తమ గ్రామంలోకి రావద్దంటూ రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి చెప్పుల దండను తొలగించారు. అవంతి శ్రీనివాస్‌ తమ గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగింది.అనంతరం అవంతి శ్రీనివాస్ తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి చెందిన కొందరు కావాలనే ఇలా చేశారని అన్నారు. ఇక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టు పరిధిలో ఉందని.. వాళ్లు కావాలనే రాద్ధాంతం చేశారన్నారు.

Leave A Reply

Your email address will not be published.