రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ధారూర్ మండలం బాచారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దెముల్ మండల బాధితులను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. కూలి కోసం వికారాబాద్ కు ఆటోలో వెళ్తుండగా జరిగిన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన మహేందర్ రెడ్డి, ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు గాయాలపాలైయ్యారు. గాయపడిన బాధితులను నగరంలోని నీమ్స్ ఆస్పత్రిలో పరామర్శించి సరైన మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించడమే కాకుండా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభుతి ప్రకటించారు బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు.