బోర్లం గ్రామానికి ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి మండలంలోని బోర్లంగ్రామానికి 3 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించారు. ఈ సందర్బంగా బోర్లo గ్రామ రైతులు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో గత 4 రోజుల క్రితం దొంగలించబడిన (3)ట్రాన్స్ఫార్మర్లను త్వరగా ఇప్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ రైతుల పంట పొలాలు పొట్ట దశలో ఉన్నందున కాపాడడం తన కర్తవ్యం గా భావించి విద్యుత్తూ శాఖ sc కామారెడ్డి తో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకొని (3)ట్రాన్స్ఫార్మర్లను ఈరోజు బోర్లం గ్రామంలోఉదయం పంట పొలాల వద్ద వాటిని బిగించారు. బోర్లం గ్రామం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించినందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి కి ప్రత్యేకధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రాన్స్కో డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంతరం 3 రోజులపాటుకష్టపడి త్వరగా బిగించినందుకు మా గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు se రమేష్ బాబు,de కామేశ్వరరావు, Ae అనిల్ కుమార్, లైన్మెన్ అంబర్ సింగ్,లైన్ ఇన్స్పెక్టర్అనిల్, కమ్మరిశ్రీపాల్ (um) కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంత్రి గణేష్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ గౌడ్ , రైతుబందు మండల్ డైరెక్టర్ పట్లోళ్లదేవేందర్ రెడ్డిమాజీఎంపిటిసి మన్నె విట్టల్, గొబ్బురు జనార్దన్ రెడ్డి,విట్టల్ రెడ్డి కమ్మరి,నర్సింలు,కమ్మరి గంగారం, జామా మజీద్ ఎక్స్ సదర్ హైమద్, మజీద్ సెక్రటరీ సయ్యద్ మంజూరు,మంద సాయిలు, పోతరాజులింగం గుజ్జరినాగరాజ్ మన్నెపెద్దసాయిలు, బుడ్డ సాయిలు, గ్రామ రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.