మాజీ ఎంపీ, డి. శ్రీనివాస్(డీఎస్) కు తీవ్ర అస్వస్థత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్(డీఎస్) సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని సిటీ న్యూరో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. డీఎస్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డి. శ్రీనివాస్ గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.