బాపట్ల బీచ్ లో నలుగురు గల్లంతు .. ఇద్దరు మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బాపట్ల (Bapatla) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో (Ramapuram Beach) నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీకెండ్ కావడంతో మంగళగిరి నుంచి రామాపురం బీచ్‌కు 12 మంది యువకులు సరదాగా వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానానికి దిగగా.. నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిని గమనించిన తోటి స్నేహితులు ఇద్దరిని కాపాడగా.. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు బాలనాగేశ్వరరావు (27), బాలసాయిగా (26) గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీచ్‌కు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.