తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చేస్తున్న పని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయని ఎంపీ సంతోష్ అన్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం సత్ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ కవర్ పెరడగమే దీనికి నిదర్శమని తెలిపారు. దేశంలో మిగితా రాష్ట్రాల్లో పచ్చదనం తగ్గితే తెలంగాణలో అడవుల రక్షణ – సంరక్షణతో గ్రీన్ కవర్ పెరిగిందని వివరించారు. హైదరాబాద్ వెస్టులో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ సందర్శకులకు, ప్రకృతి ప్రేమికులకు మంచి సౌకర్యాలు అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, కలెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.