ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దర్

తెలంగాణ జ్యోతి : గాయకుడు గద్దర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా యుద్ధనౌకగా తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్న గద్దరన్న పోయి పోయి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరడం ఇప్పుడు సంచనలనంగా మారింది. కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న గద్దర్ వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గురువారం నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేయనున్నట్టు గద్దర్ ప్రకటించారు. మరోవైపు ఈ నెల 2న పీస్ మీటింగ్ కు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ విరమించారు. ఆయనకు గద్దర్ నిమ్మసరం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Leave A Reply

Your email address will not be published.