కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రజాగాయకుడు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుండి తొలుత గన్ పార్క్ వరకు ఆయన భౌతికకాయాన్ని తరలించి నివాళులు అర్పిస్తారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర సాగనుంది.
గద్దర్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచుతారు. మధ్యాహ్నం 03 గంటలకు గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగన. గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గద్దర్ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ప్రజాగాయకుడు గద్దర్ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ స్టేడియం వద్దకు తరలివచ్చారు. గద్దర్ భౌతికకాయాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు.