గ్యాస్ పైప్ లైన్ గ్యాస్ లీకేజీ..భయంతో పరుగులు తీసిన జనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కుత్బుల్లాపూర్ జోన్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  కొంపల్లి ప్రధాన రహదారి పక్కనే రోడ్డు విస్తరణ పనుల కోసం జెసిబి సహాయం తో గుంత తవ్వుతున్న క్రమంలో  గ్యాస్ పైప్ లైన్ పగిలింది పగిలిన పైప్ నుండి గ్యాస్ లీకేజీ కావడంతో స్థానికంగా ఉన్న షాపులలో నుండి భయంతో పరుగులు తీశారు. అక్కడికి దగ్గరలోనేఉన్న ఒక వ్యక్తి సిగరెట్ కాలుస్తూ అటుగా రావడంతో  మంటలు అంటుకుని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి  గాయాలైన ఇద్దరినీ దగ్గర్లో ఉన్న రష్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయం తో మంటలను అదుపు చేశారు.గ్యాస్ ఏజెన్సీ కి సమాచారం ఇవ్వగా  భాగ్య నగర్ గ్యాస్ అధికారులు పైప్ లైన్ కు మరమ్మత్తులు  చేసి పగిలిన పైప్ లైన్ ను బాగుచేశారు….

Leave A Reply

Your email address will not be published.