21 న కంగ్టి మండలంలో సర్వసభ్య సమావేశం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్జి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 21 బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీడీవో ముజఫరోద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించే సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి విధిగా హాజరు కావాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.