బండి సంజయ్ ని కలిసిన ఘట్కేసర్ ఎంపిపి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముదోల్ నియోజకవర్గంలో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తో కలిసి రాష్ట్ర స్థానిక సంస్థల గౌరవ అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియంత నిరంకుశ అవినీతి పాలన పై మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు చేస్తున్న పాదయాత్రకు ప్రజల ఆదరణ చూసి కెసిఆర్, టిఆర్ఎస్ కు వణుకు పుడుతుందని పాదయాత్ర చెయ్యనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని రాష్ట్ర పోలీసులు కేసీఆర్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని వచ్చేది బిజెపి ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు ఎన్ని ఆటంకాలు వచ్చిన పాదయాత్ర ఆగేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శోభారెడ్డి,వార్డ్ మెంబర్ సురేష్, దామోదర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.