వైభవంగా అయ్యప్ప స్వామి మహా మండల పడిపూజ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలకేంద్రంలో మంగళవారం రాత్రి శబరిగిరి అయ్యప్పస్వామి మహా మండల పడిపూజ మహోత్సవాన్ని అయ్యప్పస్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అరటిచెట్లు, పువ్వులతో అందంగా ముస్తాబు చేసిన మండపంలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వామి మూర్తులను ఏర్పాటు చేసి పంచామృతం, పుసుపు, కుంకుమ, గంధం, భస్మం వంటి అభిషేకాలు నిర్వహించారు. వివిద గ్రామాల నుండి అధిక సంఖ్యలో అయ్యప్పస్వాములు తరలివచ్చి భజనలు, కీర్తనలు ఆలపించారు. అయ్యప్పస్వామికి పంచామృతాలు, మల్లెపూలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఊరేగించి పడిమెట్లు వెలిగించి మహానైవేద్యాన్ని సమర్పించారు. స్వాములకు, భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు లింగం, మాదప్ప, కోటి, గంగారాం, ప్రభాకర్గౌడ్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.