ముద్ర కిషోర్ యోజన ద్వారా స్వర్ణకార కుటుంబాల్లో స్వర్ణకాంతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముద్ర కిషోర్ యోజన ద్వారా స్వర్ణకార కుటుంబాల్లో ఇండియన్ బ్యాంక్ స్వర్ణకాంతులు నింపిందని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యులు పంచుమర్తి శ్రీనివాసరావుఅన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణు మాధవ్ ఆదేశాల మేరకుఇండియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న బి సుధారాణి ని జనరల్ మేనేజర్ గా పదోన్నతి వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం స్టీరింగ్ కమిటీ సభ్యులు పంచుమర్తి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు కర్రి  రాఘవ లతో కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా పంచుమర్తి శ్రీనివాసరావుమాట్లాడుతూ  రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం 23 పట్టణాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ముద్ర కిషోర్ యోజన ద్వారా స్వర్ణకార కుటుంబాల్లో స్వర్ణకాంతులు నింపడానికి స్వర్ణకారులకు ముడి బంగారం ద్వారా తయారీకి ఇండియన్ బ్యాంకు వారి సహకారం అభినందనీయమన్నారు. విజయవాడ జోన్లో 250 లబ్దిదారుల స్వర్ణకారులకు 12: 50 కోట్ల రూపాయలు వేగవంతంగా సాంక్షన్ చేసి ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ పోటీలో స్వర్ణకారులకు అండగా నిలుస్తున్న ఇండియన్ బ్యాంకు వారికి రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తో పాటుగా సీనియర్ మేనేజర్ Y P S మూర్తి మార్కెటింగ్ ఆఫీసర్ కుమారి ప్రతిభ గారు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.