జగదాంబకు బంగారు నంది అవార్డు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ సంఘ సేవకురాలు జగదాంబ వృద్దాశ్రమం నిర్వాహకురాలు,హేల్ టాటా మణి చారిటబుల్ ట్రస్టు సబ్యులు జగదాంబకు సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో  నిర్వహించిన కార్యక్రమం లో వేలూరి ఫౌండేషన్ సంస్థ ఉగాది పురస్కారాల సందర్బంగా బంగారు నంది అవార్డును ప్రదానం చేసింది. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగదాంబ సేవాలను గుర్తించి వేలూరి ఫౌండేషన్ సంస్థ ఈ అవార్డు ను ప్రముఖ సంఖ్యాశాస్త్రవేత్త దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేసింది .ఈ సందర్బంగా జగదాంబ మాట్లాడుతూ చేసే ప్రతి పని ప్రశాంత జీవనం గడుపడానికి దోహద పడుతుందని పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. పేదలకు సాయం చేయడంలో ఉన్న సంతృప్తి మరెందు లోనూ లేదని అన్నారు. తాను తన మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా సేవలు చేస్తున్నామనిపేదల ఆకలి తీర్చడం తమ బాధ్యతగా పలు కార్యక్రమాలు నిర్వహించామని జగదాంబ వెల్లడించారు. 

Leave A Reply

Your email address will not be published.