జియో సిమ్ యూజర్లకు గుడ్ న్యూస్
తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: దేశంలోని దిగ్గజ టెలికం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. 5జీ సేవలను విస్తరించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తాజాగా రాజస్థాన్లో 5జీ సేవలు ఆవిష్కరించారు. రాజ్సమంద్ నాథ్ద్వారా ప్రసిద్ధ దేవాలయం శ్రీనాథ్జీ దేవాలయంలో ఆకాశ్ అంబానీ 5జీ సర్వీసులు ప్రారంభించారు. రిలయన్స్ జియో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశ్ అంబానీ చేసిన తొలి కీలక ప్రకటన ఇదే అని చెప్పుకోవచ్చు. ఆకాశ్ అంబానీ శనివారం ఉదయం స్పెషల్ ఫ్లైట్లో ఉదయ్పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి నాథ్ద్వారా వెళ్లారు. అక్కడ 5జీ సర్వీసులు ప్రారంభించారు. అంబానీ కుటుంబానికి శ్రీనాథ్జీ ఆరాధ్య దైవంగా చెప్పుకోవచ్చు. శ్రీనాథ్జీపై అంబానీలకు అపారమైన నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా రిలయన్స్జియో 4జీ సేవలను కూడా ఈ ఆలయం నుంచే ప్రారంభించారు. ఇప్పుడు 5జీ సేవలను కూడా ఆవిష్కరించారు.