మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుంది

-  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వ పడ్డానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై నిజం గెలవాలి అని ప్రజలతో కలిసి పోరాడుతున్నానన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో తమకు ఎంతో ఊరటనిస్తోందన్నారు. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోందని అన్నారు. తనను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డానన్నారు. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నాను అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.