హమాలీలను సన్మానించిన ప్రభుత్వ విప్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: దర్మపురి మండలం దోనుర్ గ్రామంలోని  ఐకెపి సెంటర్ లో సకాలంలో వడ్ల కొనుగోలును పూర్తి చేసిన సందర్భంగా సెంటర్  నిర్వాహకులను, హమాలిలను ప్రభుత్వ విప్ , ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడతూ సమిష్టిగా కృషి చేసి ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం అబినందనియమన్నారు. అందరు ఇలానే కష్టపడితే రైతుల ఇబ్బందులు తొలగించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, ఐకేపీ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.