ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ధోవిరెడ్డి సుధీర్రా రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదలకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తోందని, అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హయత్ నగర్, ఉప్పల్, సరూర్ నగర్ మండలాల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంద మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, శరత్ తదితరులు పాల్గొన్నారు.