ఘనంగా దత్త జయంతి వేడుకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఘనంగా దత్త జయంతిని వేడుకలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి ఒక రోజు ముందు తెల్లవారుజామున వివిధ మార్గాల గుండా భక్తులు ఖండోపతండాలుగా రామారెడ్డి మండలం మోసంపూర్ గ్రామంలో గల పవిత్ర పుణ్యక్షేత్రం దత్తాత్రేయ ఆశ్రమం వద్దకు చేరుకున్నారని అన్నారు ప్రతాశ్రమంలో పీఠాధిపతుల వంశపార్యం పరంగా కొనసాగుతుందని అన్నారు ఈ సంవత్సరం మాకాంతరావు పిఠాధిపతి ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ వేడుకలు సప్తహారం ఏడు రోజులు కొనసాగుతాయని అన్నారు భక్తుల సౌకర్యార్థం అదనపు గదుల కోసం విరాళాల రూపంలో భక్తుల సహాయార్థం గదులు నిర్మించామని చెప్పారు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు జయంతిని పురస్కరించుకొని మూల విరాట్ దత్తాత్రేయ విగ్రహాన్ని తొట్టెల్లో వేసి జోలపాట పాడి భక్తుల భజన సంకీర్తనలతో ఆలయం మార్మోగిందన్నారు అనంతరం గోపాల కాలువలు నిర్వహించామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి వైస్ ఎంపీపీ రవీందర్ రావు మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి ఎంపీటీసీ ఉమా దత్తాద్రి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు నాయకులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.