గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల.. 1365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. నిన్న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదలైంది. 1365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 768 గ్రూప్-2 పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తదితర వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక గ్రూప్-4 నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది.