తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. టీఎస్పీఎస్సీ ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షల్లో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‍‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. కాగా, గతేడాది గ్రూప్-1 పరీక్ష నిర్వహించగా.. పేపర్ లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో మరోసారి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా.. మళ్లీ రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.