మోదీ ఇంటిపేరు’ కేసులో రాహుల్ గాంధీ కి గుజరాత్ హైకోర్టులో ఎదురు దెబ్బ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మోదీ ఇంటిపేరు’ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి గుజరాత్ హైకోర్టులో ఊరట లభించలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఆయన దోషి అని ఇచ్చిన తీర్పు అమలును నిలిపేసేందుకు కూడా నిరాకరించింది. దీంతో ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది.హైకోర్టు నిర్ణయంతో రాహుల్ గాంధీపై లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత కొనసాగుతుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఇదిలావుండగాఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సెషన్స్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అపీలును విచారించిన హైకోర్టు తీర్పు చెప్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీపై ప్రస్తుత కేసు మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కేసులు కూడా దాఖలయ్యాయని తెలిపింది. వీర్ సావర్కర్ మనుమడు దాఖలు చేసిన కేసు అటువంటి వాటిలో ఒకటి అని గుర్తు చేసింది. ఆయనపై ఎనిమిది క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదైవిచారణలో ఉన్నాయని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీఆయనను దోషిగా నిర్థరిస్తూ ఇచ్చిన తీర్పు ఏ విధంగానూ అన్యాయమైనది కాదనిఈ తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. గాంధీ అపీలును దానిలోని యోగ్యతల ఆధారంగా సాధ్యమైనంత త్వరగా విచారించితీర్పు చెప్పాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూదొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందిఅని రాహుల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన దోషి అని కోర్టు 2023 మార్చి 23న తీర్పు చెప్పిందిఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దోషిగా నిర్థరణ అయిన వ్యక్తి చట్టసభల సభ్యునిగా కొనసాగడానికి చట్టం అంగీకరించదు కాబట్టి ఆయన వయనాద్ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని లోక్‌సభ సచివాలయం మార్చి 24న ప్రకటించింది. ఈ కోర్టు తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో ఆయన ఏప్రిల్ 25న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత తీర్పు చెబుతామని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.