ధర్మారెడ్డి మృతికి సంతాపం తెలిపిన గుత్తా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారి తండ్రి డాక్టర్ ధర్మారెడ్డి గారి మృతి పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, డాక్టర్ రమేష్ రెడ్డి గారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.