చేతలతోనే కాదు మాటలతోనూ ఇబ్బంది పెట్టినా అది వేధింపులతో సమానం
- నేను, నా చెల్లి, అమ్మ, మామ్మ ఇలా ప్రతి ఒక్కరు వేధింపులు ఎదుర్కొన్నవారే - ప్రముఖ నటి సాయిపల్లవి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చేతలతోనే కాదు మాటలతోనూ ఇబ్బంది పెట్టినా అది వేధింపులతో సమానం అని ప్రముఖ నటి సాయిపల్లవి అన్నారు.శుక్రవారం సాయిపల్లవి ఎపిసోడ్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్తో దూసుకుపోతుంది. కాగా ఈ ఎపిసోడ్లో సాయిపల్లవి సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. కాగా ఈ ఎపిసోడ్లో తను నటించిన ‘లవ్స్టోరీ’ సినిమా గురించి మాట్లాడుతూ చేతలతోనే కాదు మాటలతో పక్కవారిని ఇబ్బంది పెట్టినా అది వేధింపులతోనే సమానమని సాయిపల్లవి తెలిపింది. నేను, నా చెల్లి, అమ్మ, మామ్మ ఇలా ప్రతి ఒక్కరు వేధింపులు ఎదుర్కొన్నవారే. వేధింపులకు గురి కాని ఒక్క అమ్మాయిని కూడా నేను చూడలేదంటూ వెల్లడించింది.వయసుతో సంబంధంలేకుండా ప్రతీ ఒక్కరూ ఇలాంటి వాటికి గురవుతారని, ప్రతి ఒక్కరిలో ఈ బాధ ఉంటుదని తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పాలి? చెబితే నమ్ముతారా? లేదా? అనే సంకోచిస్తారని, అలాంటి వాళ్లు నేను నటించిన లవ్స్టోరీ సినిమాను చూపించి.. నాక్కూడా అలానే జరిగిందని చెప్పి ఆ ఇబ్బంది నుంచి విముక్తి పొందచ్చు అని చెప్పుకొచ్చింది.ఓటీటీలకు ఈ మధ్య ఆధరణ బాగా పెరిగిపోయింది. థియేటర్ రిలీజ్కు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఓటీటీ పెద్ద దిక్కు అయింది. సినిమాలనే కాదు వెబ్ సిరీస్లు, టాక్ షోలు ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలకు వేదికైంది. కాగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘అన్స్టాపబుల్’ టాక్ షో తరహాలోనే ప్రముఖ సింగర్ స్మిత హోస్ట్గా ‘నిజం విత్ స్మిత’ అనే టాక్షోను నిర్వహిస్తుంది. సోనిలైవ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే చిరంజీవి, నాని, రానా, సుధీర్ బాబు వంటి సినిమా సెలబ్రెటీలు ఈ టాక్షోకు వచ్చారు. కాగా తాజాగా సాయిపల్లవి ఈ షోకు గెస్ట్గా వచ్చారు.