తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గుజరాత్లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగెల వంతెన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన తననెంతో బాధించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని కేవడియాలో ఉన్న ఐక్యతా ప్రతిమ వద్ద ప్రధాని నివాళి అర్పించారు. ‘ప్రస్తుతం కేవడియాలో ఉన్నా.. నా ఆలోచనంతా మోర్బీ బాధితుల గురించే. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ.