తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒక పార్టీతో పొలిటికల్ జర్నీ ప్రారంభించారు.. మరో పార్టీలో చేరి కెరీర్ను మలుచుకున్నారు.. అధికార పార్టీ అయినప్పటికీ.. ఆశలు నెరవేరకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగరవేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్ లో చేరానని, తనను మోసం చేశారని పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు పార్టీలో చేరిన వారికి అన్యాయం చేశారని దుయ్యబట్టారు. ఎవరో ఓడిపోతే తానే ఓడించానని ఎంపీ టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. ఏడున్నరేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయారు. ఎవరు అడ్డుకున్నా.. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కనీసం తన ఆవేదనను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. మధిర నియోజకవర్గం లో ఉచిత విద్యుత్ 9 గంటలు వస్తుందా? అని ప్రశ్నించారు. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. ఎన్నికల హామీలు ఏమయ్యాయో కేసీఆర్ చెప్పాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.