తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ పార్టీ హోదా కోల్పోవడంతో దానిని పునరుద్ధరించాలంటూ అమిత్ షాకు మమతా బెనర్జీ ఫోన్ చేశారంటూ బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం ఆరోపించారు. దీంతో మమతా బెనర్జీ దీనిపై బుధవారం స్పందించారు. ‘ఇది తెలిసి నేను ఆశ్చర్యపోవడంతోపాటు షాక్ అయ్యాను. తృణమూల్ జాతీయ పార్టీ హోదా గురించి అమిత్ షాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా’ అని అన్నారు. సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపై కూడా మమతా బెనర్జీ మాట్లాడారు. ‘కొన్నిసార్లు మౌనం బంగారం. ప్రతిపక్షం కలిసి కూర్చోని మాట్లాడుకోదని అనుకోవద్దు. మేమంతా కలిసే ఉన్నాం. అందరూ ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు గాలివానలా జరుగుతుంది’ అని అన్నారు. అలాగే స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేయడంపైనా మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున సున్నితమైన ఈ అంశంపై తాను మాట్లాడబోనని చెప్పారు. కోర్టు ఆదేశం తర్వాత మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందని అన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.