”స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం పై సుప్రీంకోర్టు తీర్పుపై గుండె పగిలింది     

- ట్విట్ట‌ర్ వేదిక‌గా టాలీవుడ్ నటి మంచు లక్ష్మి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం పై  టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ”స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పుపై నిరాశతో తన గుండె పగిలిపోయిందని తెలిపింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి.. మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించే మన దేశానికి ఇది నిజంగా అవమానం. ఇతర దేశాల్లో స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు… మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా?” అని మంచు లక్ష్మి ట్విట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.కాగా స్వలింగ సంపర్కులు (ఎల్జీబీటీక్యూఏ) సహజీవనం చేయటం నేరం కాదంటూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేలా స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌, ఫారిన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌లో మార్పులు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో 18 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వెలువడింది. ఎల్జీబీటీల కోసం చట్టాలను మార్చటం కుదరదని ధర్మాసనం తేల్చిచెప్పింది.  స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించిన విష‌యం తెలిసిందే. స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సింది పార్లమెంటు మాత్రమేనని తేల్చిచెప్పింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘స్వలింగ వివాహాల చట్టబద్ధత’పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించిం

Leave A Reply

Your email address will not be published.