తెలంగాణలో రాగల 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఉరుములుమెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు కరీంనగర్‌పెద్దపల్లిభూపాలపల్లిములుగుకొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది.మంగళవారం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములుమెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌ఆసిఫాబాద్‌నిర్మల్‌నిజామాబాద్‌జగిత్యాలకామారెడ్డి జిల్లాల్లో అక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు నిజామాబాద్‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌ములుగుజయశంకర్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వివరించింది.

Leave A Reply

Your email address will not be published.