తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్నాథ్కు యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఘటన స్తలానికి చేరుకున్నాయి. సహాయకచర్యలను కొనసాగిస్తున్నాయి. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? చనిపోయిన వాళ్ల వివరాలు ఏంటీ అనే విషయాలు తెలియాల్సి ఉంది.
వాతావరణం అనుకూలంగా లేని కారణంగానే కేదార్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతదేహాలను అధికారులు రికవరీ చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.
గరుడచట్టి సమీపంలో ఘటన..
కేదార్నాథ్ ధామ్లో హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదం ఉత్తరాఖండ్లో సంచలనం రేపుతోంది. గరుడచట్టి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ హెలీ కంపెనీకి చెందినదని అధికారులు చెబుతున్నారు.
ముక్కలైన హెలికాప్టర్..
ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు కూర్చున్నారు. దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముక్కలైన హెలికాప్టర్ శకలాలతో ఘటన స్తలం భీతిల్లిపోయింది. ఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిజానికి కేదార్నాథ్ ధామ్లో పొగమంచు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈతరహా ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి.