హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సిట్ దర్యాప్తును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఫామ్‌హౌస్‌ డ్రామాపోలీసు విభాగానికి ఎలాంటి ఆధారాలు లేని కేసులో ప్రభుత్వం సిట్ వేసి ప్రజలను మభ్యపెట్టాలనుకుందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదనిపాలనను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.