పోలవరంవద్ద హైటెన్షన్.. అనుమతి ఉన్నవారినే ప్రాజెక్టు లోపలికి ..

-  పోలీసుల తీరుపై తెలుగుదేశంశ్రేణులు తీవ్ర ఆగ్రహం  -  పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ .. ఉద్రిక్తత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పోలవరంవద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతి ఉన్నవారినే ప్రాజెక్టు లోపలికి పంపిస్తామని పోలీసులు ఆదేశించారు. దీంతో పోలవరం గ్రామం ప్రవేశం వద్ద టీడీపీ నేతల వాహనాలను నిలిపివేశారు. పోలీసుల తీరుపై తెలుగుదేశంశ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఎమ్మెల్యే రామరాజు, మాజీ మంత్రి పీతల సుజాతలతోపాటు పలువురిని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒకింత పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద మీడియాకు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పోలవరం గ్రామంలోనూ, చెక్ పోస్టు వద్ద మీడియానూ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. కాగా అనుమతి ఉన్న వారికి మాత్రమే ప్రాజెక్టును చూసేందుకు పోలీసులు ప్రత్యేక వాహన కాన్వాయ్‌ని ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.