వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రం

.. అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇటలీలోని మిలాన్ నుంచి అమెరికా లోని న్యూయార్క్ జేఎఫ్ కే ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రోమ్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం..డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలాన్ నుంచి బయల్దేరింది. అయితే విమానం గాల్లోకి ఎగిరిన సమయంలో అనుకూలంగానే ఉన్న వాతావరణం.. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. విమానం గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల్లోనే వడగళ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడం మొదలు పెట్టింది. ఆ వడగళ్లు విమానం ముక్కు, రెక్కలు పై పడ్డాయి. దీంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. విమానం ముక్కుకు ఏకంగా పెద్దపాటి రంధ్రం పడింది. అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రోమ్ కు మల్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.