పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు

    సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్ధులు భారతదేశాన్ని ఎలా కాపాడతారని మోదీ ప్రభుత్వాన్ని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఢిల్లీలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. వారు చేసిన తప్పేంటి? పార్లమెంట్‌పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ MIM ఎంపీ ఇచ్చి ఉంటే ఏం చేసేవారు? పార్లమెంట్‌నే కాపాడలేని అసమర్థులు భారతదేశాన్ని ఎలా కాపాడతారు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని నా అనుమానం’’ అని నారాయణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.