యాదాద్రిలో భారీ స్వాగత తోరణం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యాదగిరిగుట్ట: యాదాదిలో నిర్మితమైన భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం కానుంది. కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా కొండపైన పంచనారసింహుల ప్రాంగణానికి చేరే దిశలో.. కొండ దిగేటప్పుడు తోరణంపైన వెనకా, ముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపం.. ఇరువైపులా గరుడాళ్వారుడు, ఆంజనేయస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తోరణానికి ఇరువైపులా ద్వారపాలకులు, మధ్యలో మహావిష్ణుమూర్తి రూపం, కింది భాగంలో యక్షులు దర్శనమిస్తారు. స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఐరావతం, తీర్థజనుల దృశ్యాలను తీర్చిదిద్దారు.