అత్యధిక జీవ వైవిధ్యo నగరంగా హైదరాబాద్

2015 నుండి రాష్ట్రవ్యాప్తంగా నాటిన మొక్కలు::288 కోట్ల 48 లక్షలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణకు హరితహారంతో ఎటు చూసినా పచ్చదనం- అడుగడుగునా ఆహ్లాదం, సిఎం కెసిఆర్ చే మంచిరేవుల టెక్ ఫారెస్ట్ పార్కు లో ఈ నెల 26 న 1.25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం. హైదరాబాద్ ఆగస్టు 24 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);: అస్తిత్వం కొరకు ఆరాటపడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పునర్నిర్మాణం దిశగా అభివృద్ధి సంక్షేమ రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి ప్రాధాన్యత పెరిగింది. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని, స్వచ్చమైన గాలి అందించుటకు , జీవ వైవిధ్యత ను కాపాడుటకు 2015 లోనే తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన హరితహారంతో  పచ్చని చెట్లతో అడుగడుగునా ఆహ్లాదం పంచుతున్న ప్రాంతాలుగా తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఆవిర్భవించాయి. తెలంగాణకు హరితాహారం కింద 2015 నుంచి ఇప్పటదాకా రూ.11,095 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 288 కోట్ల 48 లక్షలు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచంలో చేపట్టిన పెద్ద మానవ ప్రయత్నాల్లో 3 వదిగా హారితహారం గుర్తింపు పొందింది. హరితహారం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయుటకు ప్రజలను ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నది. ఆయా ప్రాంతాలు, నేలల స్వభావానికి అనువైన, ప్రజలు కోరుకునే రకాల మొక్కలను సరఫరా చేయుటకు రాష్ట్రవ్యాప్తంగా 14,864 నర్సరీలను ఏర్పాటు చేశారు. నర్సరీల్లో ఈ సంవత్సరం 30.29 కోట్ల మొక్కలు పెంచారు. ఈ సీజన్లో 19.29 కోట్ల మొక్కలు నాటనున్నారు. అందులో భాగంగా ఈ నెల 26 న మంచిరేవుల టెక్ ఫారెస్ట్ పార్కు లో చేపట్టే 1 కోటి 25 లక్షలు మొక్కలు నాటే కార్యక్రమo లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.తెలంగాణకు హారితాహారం తో 2015 నుంచి ఇప్పటిదాకా దాదాపు 8 % గ్రీన్ కవర్ పెరిగింది. అటవీ పునరుద్ధరణ ప్రక్రియ సత్ఫలితాలు నిస్తున్నది. అందులో భాగంగా 2.03 లక్షల ఎకరాల లో బ్లాక్ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు. 13.44 లక్షల ఎకరాల లోని క్షీణించిన అటవీ ప్రాంతo  పునరుద్ధరిoచబడింది.  చీడ పీడల నుంచి రక్షించుటకు 55 కోట్ల చెట్లు, మొక్కలకు రూట్ స్టాక్ ట్రీట్మెంట్ చేశారు. అలాగే అడవుల సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాల చుట్టూ 10,980 కిలోమీటర్లు పొడవు కందకాలు తవ్వారు. ఫారెస్ట్ ఫైర్ లైన్లు ఏర్పాటు చేశారు.

**రహదారి ఏవెన్యు ప్లాంటేషన్లు :: 1,00,690 కిలోమీటర్లు

**మల్టీ లెవెల్ రహదారి ప్లాంటేషన్లు:: 20,828 కిలోమీటర్లు

**రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నర్సరీలు::14,864

**ఈ ఏడాది నర్సరీల్లో పెంచిన మొక్కలు::30.29 కోట్లు.

**ప్రస్తుత సీజన్లో నాటే మొక్కలు లక్ష్యం::19.29 కోట్లు

6) పల్లె ప్రకృతి వనాలు::19,472

బృహత్ పల్లె ప్రకృతి వనాలు::2,077

7) 164 హరిత వనాల ద్వారా 1.71 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పెంచుతున్న మొక్కలు::1.16 కోట్లు

8) HMDA పరిధిలో 1.6 లక్షల ఎకరాల్లో 188 ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి.

9) గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారిచే

తేదీ 26-08-2023 న మంచిరేవుల టెక్ పార్కులో ఒకే రోజు 1.25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమo ప్రారంభం.

Leave A Reply

Your email address will not be published.