హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రయాణికులతో మెట్రో స్టేషన్‌లు రద్దీగా మారాయి. మెట్రో రైళ్లలో రోజూవారీగా ప్రయాణించే వారి సంఖ్యల లక్షల్లోనే ఉంది. నగరంలో పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. మెట్రో రైళ్లలో రోజూవారీగా ప్రయాయణించే వారు 5 లక్షలకు పైగా ఉన్నారు. రోజువారీగా ప్రయాణికుల సంఖ్య 5 లక్షల మార్క్ దాటింది.దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్న (సోమవారం) హైదరాబాద్ మెట్రో రైళ్లలో లక్షల 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారని మెట్రో అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు హైదరాబాద్ మెట్రో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.