నేను పార్టీ మారడం లేదు

- బీజేపీ నేత సోయం బాపూరావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నాపై అర్థం లేని ఆరోపణలు బాధాకరం. ఈ నెల 27న నా కొడుకు పెళ్లి ఉంది.. పెళ్లి కార్డులు అన్ని పార్టీల వారికీ ఇస్తాం. పార్టీలకు అతీతంగా పెళ్లికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నాను. అందులో భాగంగా కేసీఆర్ రేవంత్ రెడ్డికి సైతం పెళ్ళి పత్రిక ఇస్తాను. మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి నేనే ఆహ్వానించా. మహేశ్వర్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు. నాపై తప్పుడు ప్రచారం వెనక బీఆర్ఎస్ ఉంది. కర్ణాటక గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ దేశమంతా గెలిచిన్నట్టు కాదు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన ఓట్ల శాతం తగ్గలేదు’ అంటూ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.