2024లో చంద్రబాబు గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుంది
- ఏపీలో రానున్న ఎన్నికలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు !
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2024లో టీడీపీ అధినేత చంద్రబాబు గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని సినీ నటుడు రజనీకాంత్ జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో రజనీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలనిపిస్తుందన్నారు. కానీ.. రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుందన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఆయన ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసని తెలిపారు. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని కొనియాడారు. ‘‘ఇటీవల చాలాకాలం తర్వాత హైదరాబాద్ను సందర్శించాను.. నేను హైదరాబాద్లో ఉన్నానా.. లేక న్యూయార్క్లో ఉన్నానా అనిపించింది’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు.