నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచాడు

.. పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు నియోజకవర్గానికి ఏదో చేస్తాడని నమ్మి రాజగోపాల్ ని గెలిపిస్తే నట్టేట ముంచాడని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండుర్ మందల గూడెం గ్రామాల ముదిరాజ్ సంఘం సోదరులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెళ్ళ సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు MLC శ్రీ బండారు ప్రకాష్ ముదిరాజ్ గారితో కలిసి పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వారు మాట్లాడుతూ నియోజక వర్గానికీ ఎదో అభివృద్ది చేస్తారు అని నమ్మి గెలిపిస్తే మూడున్నర సంవత్సరాలు నియోజక వర్గానిక్కీ అనాధ చేసి తన స్వంత స్వలాభం కోసం, బీజేపీ పార్టీ కి గుజరాతిలకు గులములుగా మారి వేల కోట్లకు అమ్ముడుబోయీ ఈరోజు అభివృద్ది కోసమే నేను రాజీనామా చేశానంటు మనముందుకు వస్తున్న రాజ్ గోపాల్ రెడ్డి గారిని తగిన గుణపాఠం చెప్పాలని కోరారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ముదిరాజ్ సోదరుల కోసం అనేకమైన అభివృధి సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ముదిరాజ్ సోదర సోదరీమణులు యువకులు ఆలోచించి నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందాలంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మన అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభార్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముదిరాజ్ సంఘం నాయకులు మహిళలు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.