ఏపీలో కరువు తాండవిస్తుంటే…

- సీఎం జగన్ మైండ్ ఎప్పుడు జైలు,కోర్టుల చుట్టే తిరుగుతోంది   -  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం జగన్ మైండ్ ఎప్పుడు జైలు,కోర్టుల చుట్టే తిరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఏపీలో కరువు తాండవం చేస్తోందని రామకృష్ణ అన్నారు. నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు   కేంద్రం ఇతర కరువు రాష్ట్రాల్లో పర్యటన చేస్తుంటే… ప్రభుత్వాలు నివేదికలు అందిస్తున్నాయన్నారు. ఇక్కడ జగన్ మాత్రం పట్టించుకోరన్నారు. రైతులు వేల రూపాయలు వెచ్చించారని.. సరైన సమయంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ అన్నారు. జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. గతంలో ఎప్పుడు శ్రీశైలంసాగర్ డ్యాంలలో ఇంతటి నీటి కొరత లేదన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తాగునీటి సమస్య కూడా జఠిలం అయ్యే అవకాశం ఉందన్నారు. ‘‘రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్త చొక్కా విప్పించడం,సైకిల్ కి కట్టుకున్న టీడీపీ జెండా తొలంగించడం నీచాతినీచం. ఇది కేవలం టీడీపీ సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని పాతిపెడుతున్న జగన్ సర్కార్ పై ప్రతిఒక్కరూ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ సీతారామన్‌కు పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. మొదటిసారి ఫోరెన్సిక్ ఆడిట్ అనే పదాన్ని వింటున్నాం. రాష్ట్రం అప్పులకుప్పలా మారడానికి సహకారం అందించింది కేంద్రం కాదాబీజేపీ,వైసీపీ డ్రామాలు ఆడుతోంది. వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది బీజేపీ సహకారంతోనేనని టీడీపీజనసేన గమనించాలి’’ అని రామకృష్ణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.